29, జులై 2013, సోమవారం

తెలంగాణ కల నెరవేరనుంది: అజిత్‌సింగ్(తుది నిర్ణయం రేపే)

తెలంగాణ కల నెరవేరనుంది: అజిత్‌సింగ్
న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ కల సాకారం కానుందని రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత, కేంద్రమంత్రి చౌదరి అజిత్‌సింగ్ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కనుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని తాను అనుకుంటున్నానని ఆయన తెలిపారు.

తుది నిర్ణయం రేపే ప్రకటిస్తం : దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణపై రేపు తుది నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ స్ఫష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీతో మాట్లాడారు. తెలంగాణపై ఇప్పటికే పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. అది పెద్ద విషయమే కాదని, కేంద్రం నిర్ణయమే ఫైనలని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజకీయ లబ్ది ఆశించడం లేదని, సమస్య పరిష్కారం కోసమే పార్టీ ప్రయత్నించిందని చెప్పారు.
రేపు సాయంత్రం 4.30 గంటలకు యూపీఏ సమన్యయ కమిటీ సమావేశం ఉంటుందని, దాని తర్వాత మరో గంటసేపట్లో సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని దిగ్విజయ్ సింగ్ ఇవాళ ఉదయం చెప్పిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి