సమైక్యవాదులార సమాధానం చెప్పండి.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం వై.ఎస్.ర్  41 మంది ఏం.ఎల్.ఏ ల చేత తీర్మానం చేసి కాంగ్రెస్హాయ్ కమాండ్ కు పంపినది నిజామా కాదా?(11-08-2000)
  2.  టి.ఆర్.ఎస్ తో 2004 లో ఏ ఉదేశ్యం పొత్తు పెట్టుకున్నారు?తెలంగాణ ప్రజలను వంచించడం కాదా?టి.ఆర్.ఎస్.  ఏం.ఎల్.ఏ లను చీల్చడం ద్రోహం కాదా?
  3. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న సాధారణ ప్రజల భూములను లాక్కుని దళారీ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది నిజం కాదా?
  4. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద ఫార్మ మరియు కేమికాల్ పరిశ్రమలలో తెలంగాణ వారికి ఎంత శాతం ఉద్యోగాలు దొరుకుచున్నవో మీకు తెలుసా?85 % స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాలుష్యం వెదజల్లే ఈ పరిశ్రమలు తెలంగాణలో సంపదను దోచుకోవడం లేదా?
  5. కనీస నిబంధనలు పాటించకుండా పరిశ్రమ వెదజల్లే కాలుష్యం వలన పటాన్ చెరువు లాంటి ప్రదేశాలలో గర్బిని స్త్రీలలో కూడా జన్యు మార్పులు జరుగుతున్నాయి.ఈ పరిశ్రమలు వెదజల్లే  కాలుష్యం వాళ్ళ గేదెలు ఇచ్చే పాలు కూడా విషతుల్యం అవుతున్నవి.తెలంగాణ భూములను ,నీటి వనరులను ఉపయోగించుకుంటున్నారు కాని తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలియదా ? 
  6. గురుకుల్ ట్రస్ట్ భూమిని అధికార దాహంతో దోచుకోలేదా అది ద్రోహం కాదా ?
  7. ఆంధ్ర ,రాయలసీమ ప్రజలకు మాత్రమే మనో భావాలు ఉంటాయ తెలంగాణ ప్రజలకు ఉండవా?
  8. కనీసం 10  % కూడా తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇక్కడ పరిశ్రమలను నడపడం మీ పెట్టుబడుదారుల దురహంకారం కాదా?
  9. బ్రిటిష్ వారు కూడా మొదట వర్తకం పేరుతో ఈ దేశంలోకి ప్రవేశించి ఈ దేశ సంపదను కొల్లగొట్టిన ఆంధ్ర ,రాయలసీమ వలస వాదుల,పెట్టు బడిధారులు కూడా తెలంగాణ ప్రాంత సంస్కృతిని ,సంపదను కొల్లగొడుతూ ఉంటె వారి నుండి విముక్తి పొందాలనుకుంటే లగడపాటి లాంటి దోపిడిదారులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా?