8, జనవరి 2012, ఆదివారం

డీ.కే అరుణ కి షాక్ ఇచ్చిన రాణి రుద్రమ

"ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతర వేస్తం..,ప్రాంతేతరురుడు ద్రోహం చేస్తె తరిమి కొడతం" అన్న కాళోజి స్పొర్తితో కదులుతున్న కాలం...

నా తెలంగాణ కోటి రతనాల వీణ" అన్నారు దాశరథి..

మంత్రివర్యులు శ్రీమతి డి.కె అరుణ గారికి*******

మీరు మంత్రి అయ్యి ఒక యేడెల్లు అయ్యుంటది..మీరు సమాచార శాఖలొ ఒక రెందేండ్లె...కాని ఇక్కడ వివక్ష అనేది గత యాభై యేండ్ల సంది జరుగుతుంది..తెలంగాణ కళాకారులను మీరు అవమానించారు..వాల్లకి ఏది రానట్టు మున్ముందు ఈ రంగం లో మనం చాల నేర్చుకుందాం మీరు దేనికి పనికిరాని దద్దమ్మలన్నట్టు మాట్లడింది మీరు...రుద్రమ దెవి గారు ఒక జర్నలిస్ట్..అంతేకాదు తెలంగాణ ఉద్యమకారిణి. ఆమె తనకి వచ్చిన ప్రైజుని తీసుకొని తన ఆవేదనని ఇక్కడ జరుగుతున్న వివక్షని సాటి తెలంగాణ మహిళగా మిమ్మల్ని గౌరవిస్తూ మన తెలంగాణ కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి చెప్పింది అందులో ఏం తప్పుంది...అంతలొనె మీరు లేచి ఆమెని కె.సి .ఆర్ ఇక్కడికి పంపించినట్టు మాట్లాడి కె.సి ఆర్ పై అక్కసుతో విమర్షించడం మీకు తగినది కాదు..ఐనా రాజకీయాలు చెసింది మీరు మీరు పాలమూర్ ని ఏం అభివ్రిద్ది చేస్తున్నవో ఒక పాలమూరువాడిగ నాకూ తెలుసు...మీరు కె.సి.ఆర్ పై జయించలేక ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేస్తు పబ్బం గడుపుదాం అంటే ఇక మీ మాటల్ని నామే ప్రజలు లేరు ఈ పాలమూరులో...మీరు పచ్చి సమైక్యవాది అన్నది తేటతెల్లం ...వోట్ల కోసం రాజకీయలు మాని ప్రజస్వామ్యబద్దంగా వ్యవహరించండి....లేదంటె మల్లీ ఈ ప్రజలు కాళోజి మాటలు గుర్తు చేసుకుంటరు జాగ్రాత్త...!!!!

ఇట్లు

మీ పాలమూరు బిడ్డ

రమేష్ జైనోజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి