తెలంగాణకు జరిగిన అన్యాయాలు

  • రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలనందించటానికి ప్రబుత్వం అనుమతించిన హాస్పిటల్స్ 409  .వీటిలో 296 హాస్పిటల్స్ ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ !తెలంగాణలో వున్నవి కేవలం 113 .ఈ 113 లో 36 ఆంధ్ర ప్రాంతీయులవే.  2010 మార్చి వరకు ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం పెట్టిన మొత్తం కర్చు 1554 కోట్లు .ఇందులో ఆంధ్ర ప్రాంతం దక్కించుకున్న వాటా 1438  కోట్లు.తెలంగాణలో కర్చు చేసింది కేవలం 116  కోట్లు.ప్రజల ప్రాణాలను కాపాడే అపర సంజీవని అని చెప్పుకునే ఆరోగ్యశ్రీ లో కూడా తెలంగాణకు  అన్యాయమే జరుగుతుంది.
  • ఒక ప్రాంత వ్యక్తి ముక్యమంత్రి  అయితే మరో ప్రాంత వ్యక్తికి ఉపముక్యమంత్రి పదవి ఇవ్వాలి .ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో ముక్యమైన అంశం .1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాయలసీమకు చెందినా నీలం సంజీవరెడ్డి cm అయ్యాడు.ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉపముక్యమంత్రిని చేయాలి కాని అది జరగలేదు పైగా ఉపముక్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని వ్యాక్యనించారు నీలం.విచిత్రం ఏంటంటే......కర్నూల్ రాజధాని గ ఉన్న అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి 13 నెలల పాటు ఉపముక్యమంత్రిగా  పనిచేసాడు .
  •  రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు 13,ఇందులో .....9 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయ్!తెలంగాణలో ఉన్నవి నాలుగు కాలేజిలే .ఆ నాలుగింటిలో రెండు రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయ్!ఆ రెండు నిజాం స్థాపంచిన ఉస్మానియా.......గాంధి మెడికల్ కాలేజిలు! మొత్తంగా రాష్ట్రంలో 1800 మెడికల్ సీట్లు ఉండగా .పది జిల్లాలు ,40 .69  శాతం జనాబా ఉన్న తెలంగాణకు దక్కినది కేవలం 600 సీట్లే !అంతేకాదు ......రాజధాని హైదరాబాద్లో ఉన్న 350 సీట్లలో సగం కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కట్లేదు.
  • రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంగించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1969 నుంచి 1985 మధ్య కాలంలో 58 వేల మందియా ఆంధ్ర ప్రాంతీయులను నియనిన్చినట్టు జై భారత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది!తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో....1985 లో అప్పటి ప్రభుత్వం అక్రంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపడానికి జీవో 610...విడుదల చేసింది.ఒక సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది కాని 25 సంవత్సరాలు  గడుస్తున్న నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు .మలి దశ తెలంగాణ ఉద్యమమ మొదలైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 610  జీవో పై వేసిన గిర్ గ్లాని కమిషన్ 2004 లో తన నివేదిక ఇచ్చింది.ఉల్లంగానాలు యదేచ్చగా కొనసాగుతున్నై అని తేల్చింది.రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని తేల్చి....వాళ్ళను వెనక్కి పంపాలని సిఫారసు చేసింది.నిజాన్ని కుండబద్దలు కొట్టిన నిజాయితి గల ఒక సీనియర్ అధికారి గిర్ గ్లాని సిఫారసు లకు ఇవాల్టికి దిక్కు మొక్కు లేదు.తెలంగాణ ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగాల్లో రెండు లక్షల మంది ఆంధ్ర ప్రాంతీయులు పనిచేస్తున్నారు!
  •  రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ  ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యా 18,ఇందులో 12 ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ తెలంగాణలో ఉన్నవి కేవలం 6  !మొత్తం గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యా 3760  ఇందులో 2625  సీట్లు.....అంటే సుమారు 70  శాతంఆంధ్ర కాలేజీ ల లో నే  ఉన్నాయ్. తెలంగాణ విద్యార్థులకు అందుభాటులో ఉన్న సీట్లు 1135 మాత్రమే!వీటిలో కూడా రాజధాని లో ఉన్న 710  సీట్లు తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా దక్కడం లేదు.

  • తెలంగాణ అనే అంశం పైకి లేచిన ప్రతి సారి చాల మంది తెలంగాణ లేదా ఆంధ్ర కు గుడ్డిగా సపోర్ట్ చేస్తారు .1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది .మనకు జరిగిన అన్యాయాలు ఒక్కసారి చుడండి .


    1. తెలంగాణ లో 10 జిల్లాలు,ఆంధ్ర లో 9 జిల్లాలు మరియు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయ్.ఇందులో తెలంగాణలోని 7 జిల్లాలు,ఆంధ్రలోని 3 జిల్లాలు,రాయలసీమలోని 1 జిల్లా వెనుక బడి ఉన్నాయ్ . అంటే దాదాపు 70% తెలంగాణ జిల్లాలు ,35% ఆంధ్ర జిల్లాలు మరియు 25% రాయలసీమ జిల్లాలు వెనక బడి ఉన్నాయ్.
    2. 45% రాష్ట్ర ఆదాయం తెలంగాణ నుంచి వస్తుండగా 28% మాత్రమే తెలంగాణకు కర్చు పెడుతున్నారు మిగితా ఆదాయాన్ని ఆంధ్ర మరియు రాయలసీమలో కర్చు పెడుతున్నారు.
    3. మాములుగా మనం కేనాల్స్ ద్వారా పంట సాగు చేస్తాం .ఆ కేనల్స్ ద్వారా సాగు అవుతున్నమన తెలంగాణ లోని భూమి ఒక్క గుంటూరు జిల్లా(ఆంధ్ర) లో సాగు అవుతున్న భూమి కన్నా తక్కువ అంటే నమ్మశక్యం కాదు.
    4. నాగార్జున సాగర్ డ్యాం నల్గొండ(తెలంగాణ) జిల్లా లో ఉంది .కాని దాని నుంచి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మాత్రమే సాగు అవుతున్నవి .
    5. రెండు పెద్ద నదులు ఐనటువంటి కృష్ణా మరియు తుంగబధ్ర నదులు రాష్ట్రంలోకి మహబూబ్ నగర్ లో ప్రవేశిస్తున్నై కాని ఆ జిల్లా ఎప్పుడు కరువుతో అల్లలాడుతుంది .
    6. RDS ప్రాజెక్టూ మహబూబ్ నగర్ లో 85000 ఎకరాలు సాగు చేయడానికి నిర్మించగా రాయలసీమ నాయకులూ ఆ ప్రాజెక్టూ గేట్లను పేల్చేసి కర్నూల్-కడప ప్రాజెక్టూ కు తరలిస్తున్నారు.
    7. తెలంగాణ జిల్లాల్లో సంవత్సరానికి ఒక్క పంటనే పండించగాలుగుతున్నాం కాని ఆంధ్ర మరియు రాయలసీమలలో మాత్రం ఒక సంవత్సరానికి మూడేసి పంటలు పండిస్తున్నారు కారణం నీరు .
    8. 1986 లో తెర పైకి వచ్చిన 610 G.O ఇప్పటి వరకు అమలు కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు .మాములుగా 610G.O ఎక్కడి ప్రాంత ఉద్యోగాలు అక్కడి ప్రాంతం వాళ్ళు చేసుకోవాలని రూపొందించింది కాని ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు రావని చేసిన కుట్ర ఇది .భారతదేశ చరిత్రలో 25 సంవత్సరాలుగా అమలు కాని ఏకైక G.O 610 G.O.
    9. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద తెలంగాణా లోని ఐదు జిల్లాలు ,సీమంద్ర లోని రెండు జిల్లాలు ఉన్నాయి ,ఆని ఉద్యోగులు మాత్రం సీమంద్ర నుంచు ఐదుగురు కాగ తెలంగాణా నుంచి ఇద్దరు ఇదెక్కడి న్యాయం సీమంద్ర పాలకులారా?ఒక్కసారి ఆలోచించండి