1, అక్టోబర్ 2012, సోమవారం

ఉక్కుపాదంపై ఎక్కు పెట్టిన జనసాగరం


JANASAGARAM
-అర్ధరాత్రిదాకా నెక్లెస్ రోడ్‌లోనే జనం.. వర్షంతో బురదమయమైన పరిసరాలు
-వాతావరణ ప్రతికూలతతో మార్చ్ విరమణ.. తక్షణ కార్యాచరణ ప్రకటించిన టీ జేఏసీ
-రేపు ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్షలు..త్వరలో టీ జేఏసీ ముఖ్యుల ఆమరణదీక్ష
-మార్చ్ విరమిస్తూ కోదండరాం ప్రకటన.. ఇక టీ మంత్రులే లక్ష్యంగా పోరాటమని వెల్లడి
-ఉద్యమం విజయం సాధించిందన్న మల్లేపల్లి
-‘మార్చ్’పై పోలీసుల కిరాతకం
-జనంపై యథేచ్ఛగా లాఠీచార్జి
-విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం
-పోలీసుల కిరాతకానికి ప్రతీకలుగా మారిన ఖైరతాబాద్,సచివాలయం, క్లాక్‌టవర్, పీపుల్స్‌ప్లాజా
- రెచ్చగొట్టి.. ఆపై తలలు పగులగొట్టి..
- ఉదయం నుంచి కొనసాగిన దమనకాండ
-రణరంగమైన ఉస్మానియా క్యాంపస్
-గంటలో 50 బాష్పవాయు గోళాలు
-సచివాలయం వద్దా టియర్‌గ్యాస్ ప్రయోగం
- పీపుల్స్‌ప్లాజా వద్ద గాల్లోకి కాల్పులు
-ఎంపీ విజయశాంతిని అడ్డుకున్న పోలీసులు
-ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టు .. జీవ వైవిధ్య సదస్సును అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపు
-పోలీసుల దాడులతో రెచ్చిపోయిన ఆందోళనకారులు
-నెక్లెస్ రోడ్డులో రెండు వాహనాల దహనం
-జలవిహార్‌కు నిప్పు.. నెక్లెస్‌రోడ్డు రైల్వే స్టేషన్‌పై దాడి
-జోరువానలోనూ సడలని సంకల్పం
-ఖాళీ చేయించేందుకు ఖాకీల కుతంత్రం
- వేదికపైకీ బాష్పవాయుగోళాల ప్రయోగం
-వాటర్ కేనన్‌లతో చెదరగొట్టే యత్నం
-మార్చ్ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత


తుపాకి రాజ్యంలో.. తూటాల రాజ్యంలో సాగర తీరాన తెలంగాణ హోరుగాలులు వీచాయి! జనం జనం.. ప్రభంజనం! ఇసుకేస్తేరాలనంత! వందల్లో మొదలై.. వేలకు చేరి.. లక్షలుగా మారిన జనం! తెలంగాణ పది జిల్లాల నుంచి వచ్చి.. హుస్సేన్‌సాగర్ తీరాన పోరు కెరటాలై పొంగి.. తిరగబడ్డారు! పొద్దున్న మొదలుకుని.. రాత్రి 12 గంటల దాకా.. జోరువానలో సైతం నిలబడి నినాదాలు చేశారు! మా రాష్ట్రం మాకివ్వండంటూ నగరం నడిబొడ్డున నెక్లెస్‌రోడ్డు సాక్షిగా.. దిక్కులు పిక్కటిల్లేలా పొలికేక వేశారు! ఆ లక్షల పొలికేకలు ఒక్కగొంతుకై.. తెలంగాణం గర్జించింది! పోరు తెలంగాణ బిడ్డలు గాండ్రించారు! సమరశంఖాలు పూరించారు! నిలువెల్లా వివక్షల పుట్టలు పెంచుకున్న వలసపాలకుల దౌర్జన్య రాజ్యాన్ని ధ్వంసం చేస్తామని ప్రతినపూనారు! తలలు పగిలినా.. కాళ్లు చేతులు విరిగినా.. ఒంటిపై లాఠీ దెబ్బలు తెట్టుతేలినా చలించక నిలిచారు.. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా తెగించి కొట్లాడుతమని తెగేసి చెప్పారు! నెక్లెస్‌రోడ్డులో ‘సాగర హారాన్ని’ తళుకులీనించారు! మధ్యాహ్నం నుంచి మార్చ్ మొదలవుతుందని ప్రకటించినా.. పొద్దున నుంచే సంకలో సద్దితో.. చేతిలో జెండాతో నగరానికి తరలి వచ్చింది తెలంగాణ ప్రజ! ఒకవైపు నెక్లెస్‌రోడ్డులో మార్చ్ నిర్వహణకు అనుమతించిన పాలకులు.. ఆ మార్చ్‌లో విలీనమయ్యేందుకు బయల్దేరిన సబ్బండవర్ణాల సమూహాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు వీలున్న అన్నిమార్గాల్లో ప్రయత్నించారు. 

మార్చ్‌కు ఎటు వెళ్లాలో తెలియనివారిని ఒకసారి అటు పొమ్మని.. మరోసారి ఇటు రమ్మని చెప్పి, పథకం ప్రకారం దారిమళ్లిస్తూ.. ఓ మూలకు నెట్టి లాఠీలకు పనిచెప్పారు. లెక్కకు మిక్కిలి బాష్పవాయు గోళాలు పొగలు చిమ్మినా.. రబ్బర్ బుల్లెట్లు ఒంటినిండా తాకుతున్నా.. లాఠీలు విరుగుతున్నా.. ఉద్యమకారుల సంకల్పం సడల్లేదు! ఉదయాన్నే పాలకుల తీరు అర్థమైపోయింది. ఉస్మానియా వద్ద విద్యార్థులను మార్చ్‌కు రానీయకుండా అడ్డుకోవటంతో అక్కడ పెద్ద సమరమే జరిగింది! వందల సంఖ్యలో టియర్‌గ్యాస్ ప్రయోగాలతో ఉస్మానియా ప్రాంగణం దట్టమైన పొగలతో రణరంగాన్ని తలపించింది! తదుపరి సికింవూదాబాద్ క్లాక్‌టవర్ వద్ద.. ఖైరతాబాద్ ఫ్లైవోవర్ దగ్గర, సచివాలయం ఫ్లైవోవర్ వద్ద, బుద్ధభవన్ సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. మార్చ్‌కు వెళ్లే ప్రజలను అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేశారు. అటు జిల్లాల నుంచి బయల్దేరిన ప్రదర్శకులను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసి, వెనక్కు పంపేశారు.

అరెస్టులు, నిర్బంధకాండలు ఉండబోవని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ప్రొఫెసర్ కోదండరాం ఉదయమే మండిపడ్డారు. ఈ సమయంలోనే అరెస్టులను నిరసిస్తూ టీ కాంగ్రెస్ ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు దిగడంతో పోలీసుల వారినీ అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. మరోవైపు టీడీపీ టీ ఫోరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద అరెస్టయ్యారు. ఈ పరిణామాల మధ్యే తెలంగాణ మార్చ్ హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డుపై మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి సకల జేఏసీలు, తెలంగాణ సంఘాలు, వేదికలు, రాజకీయ పార్టీలు, వారి వారి నాయకులు, ఎమ్మెల్యేల నేతృత్వాన నెక్లెస్‌రోడ్ దిశగా కదిలాయి. వివిధ కళా బృందాల ఆటపాటలతో ఆ ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. నేతల ఉపన్యాసాలు స్ఫూర్తినిచ్చేలా సాగాయి. కానీ, పోలీసు కవ్వింపు చర్యలు సాయంవూతానికి పరిస్థితిని మార్చివేశాయి. మార్చ్‌కు బయల్దేరినవారిపై ఎక్కడికక్కడ ప్రతాపం చూపిన ఖాకీలు.. మార్చ్‌వేదిక వద్ద సైతం ఓవర్ యాక్షన్ చేశారు! ఉద్యమకారులను కవ్వించే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పీపుల్స్‌ప్లాజా వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి, ఉద్యమక్షిశేణులను బెదిరించే ప్రయత్నం చేశారు.

అయినా వెరవని శ్రేణులు.. బారికేడ్లు తోసుకుంటూ ముందుకు కదలి మార్చ్‌వేదిక వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే, ఇది మార్చ్‌ను పక్కదారిపట్టించేందుకు, కవ్వించేందుకు పోలీసులు చేసిన పని అన్న అనుమానాన్ని కోదండరాం వ్యక్తం చేశారు. పోలీసు చర్యలకు నిరసనగా రాత్రంతా ఇక్కడే ఉండబోతున్నట్లు మార్చ్‌కు హాజరైన ప్రజల అభీష్టం మేరకు ప్రకటన చేశారు. సాయంత్రం ఆరున్నర తర్వాత పోలీసులు మరోసారి కపట పన్నాగాలు వేశారు. ఏడు గంటల వరకే మార్చ్‌కు అనుమతి ఉన్న సాంకేతిక అంశాన్ని పట్టుకుని.. నెక్లెస్‌రోడ్డును క్లియర్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏకంగా వేదికమీదకే బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. వీటి ప్రభావంతో వేదికపై ఉన్న నేతలు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు వాటర్ కెనాన్లను ఉపయోగించి ఉద్యమకారులను చెదరగొ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వాటిని ఉద్యమకారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అవి తోకముడిచాయి. ఈ సమయంలోనే జోరుగా వాన పడినా ప్రజలు కదల్లేదు. చివరికి ఉద్యమక్షిశేణుల పట్టుదల ముందు పోలీసులు వ్యూహాత్మకంగా వెనక్కుతగ్గినట్లు కనిపించింది. తెల్లారితే నగరంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఉన్న కారణంగా ఎట్టిపరిస్థితుల్లోనూ తెల్లవారే సరికి నెక్లెస్‌రోడ్డు నుంచి ఉద్యమకారులను తరిమివేయాలని తీర్మానించుకున్న పోలీసులు.. బాగాపొద్దుపోయిన తర్వాత మంతనాల్లో మునిగిపోయారు. హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి, డీజీపీ దినేష్‌డ్డితో సీఎం కిరణ్‌కుమార్ చర్చించారు. బలవంతంగా పంపేసేట్లయితే ఏ రూట్‌లో పంపాలి.. ఆ రూట్‌లో ఉద్యమకారులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా టీజేఏసీ తెలంగాణ మార్చ్‌ను విరమిస్తున్నట్లు ప్రకటించింది. 

జోరుగా కురుస్తున్న వర్షంతో, వేదిక పరిసరాలు పూర్తిగా బురదమయం అయిపోయి.. కదలటానికే వీల్లేని పరిస్థితులు ఉన్న కారణంగా తెలంగాణ మార్చ్‌ను విరమిస్తున్నట్లు టీజేఏసీ నాయకత్వం ప్రకటించింది. చాతనైనంత వరకూ ఇక్కడే ఉందామని అనుకున్నామని, అయితే వాతావరణ పరిస్థితులు సహకరించని పరిస్థితుల్లో మార్చ్‌ను విరమిస్తున్నామని కోదండరాం రాత్రి 11.50 గంటల సమయంలో ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా అక్టోబర్ 2వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టీజేఏసీ ముఖ్య నాయకత్వం ఆమరణ నిరశనకు కూర్చుంటుందని చెప్పారు.

kodandaram_01
నిర్బంధాలను అధిగమించి.. సాగర హారం గ్రాండ్ సక్సెస్
-జోరువానలోనూ సడలని సంకల్పం
-దిక్కులు పిక్కటిల్లిన హైదరాబాద్
-జన సాగరమైన నెక్లెస్‌రోడ్
-ఐదు లక్షల మంది హాజరు!
-జిల్లాల నుంచి పోటెత్తిన జనం
-‘మార్చ్’పై పోలీసుల కిరాతకం
-రణరంగమైన ఉస్మానియా క్యాంపస్
-పోలీసుల కిరాతకానికి ప్రతీకలుగా మారిన ఖైరతాబాద్, సచివాలయం, క్లాక్‌టవర్, పీపుల్స్‌ప్లాజా
- అరగంటలో 50 బాష్పవాయు గోళాలు
- పీపుల్స్‌ప్లాజా వద్ద గాల్లోకి కాల్పులు
- ఎంపీ విజయశాంతిని అడ్డుకున్న పోలీసులు
- ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డి అరెస్టు
- పోలీసుల దాడులతో రెచ్చిపోయిన ఆందోళనకారులు
- నెక్లెస్ రోడ్డులో రెండు వాహనాలు దగ్ధం
- జలవిహార్‌కు నిప్పు.. నెక్లెస్‌రోడ్డు రైల్వే స్టేషన్‌పై దాడి
- మార్చ్ వేదికపైకీ బాష్పవాయువు గోళాల ప్రయోగం
- మార్చ్ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత

T_march_kavithaహైదరాబాద్, సెప్టెంబరు 30 (టీ మీడియా):ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవటంతో మొదలైన పోలీసు నిర్బంధకాండ.. అనంతరం ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైవోవర్, సికింవూదాబాద్ క్లాక్‌టవర్ సహా అనేక ప్రాంతాల్లో కొనసాగింది. శాంతియుత వాతావరణంలో జై తెలంగాణ అంటూ ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు వస్తున్న ఉద్యమకారులపై పోలీసులు అకారణంగా లాఠీలు ఝళిపించారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల తలలు పగిలాయి. అనేక మందికి కాళ్లు, చేతులు విరిగాయి. అయినా లెక్క చేయని తెలంగాణ ఉద్యమకారులు ముందుకే సాగారు. మరోవైపు ఉదయం నుంచి ఉస్మానియా క్యాంపస్ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించి, విద్యార్థులు కవాతులో పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. 30 నిమిషాల వ్యవధిలో 50 బాష్పవాయుగోళాలను ప్రయోగించారంటే ఓయూ వద్ద పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు క్లాక్ టవర్, ఖైరతాబాద్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైవోవర్, పీపుల్స్‌ప్లాజా... ఇలా ఎక్కడపడితే అక్కడ కవాతుకు వచ్చే ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు.

ఒక దశలో పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసులు గాలిలోకికాల్పులు జరిపి ఉద్యమక్షిశేణులను బెదిరించారు. దీనికి అంతేదీటుగా స్పందించిన తెలంగణ జనం.. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. వీటన్నింటినీ అధిగమించిన ఉద్యమక్షిశేణులు రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ, తెలంగాణ యునైటెడ్‌వూఫంట్, పీవోడబ్ల్యూ, తెలంగాణ నగార సమితి సహా పలు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వేదికల నేతృత్వంలో వేలు లక్షలుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. 

దద్దరిల్లిన సచివాలయ ప్రాంగణం
సచివాలయం, బుద్ధభవన్ వద్ద న్యూడెమోక్షికసీ కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఉద్యమకారులను అడ్డుకుని, బాష్పవాయువును ప్రయోగించారు. గాయపడినవారిని పలువురు ఆస్పవూతులకు తరలించారు. మీడియాపైనా పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

అడుగడుగునా ఆటంకాలే
మార్చ్ వేదికైన నెక్లెస్‌రోడ్డుకు సచివాలయం మీదుగా వెళ్లేందుకు జనం ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. రవీంవూదభారతి, అసెంబ్లీ, లిబర్టీ చౌరస్తా వైపు నుంచి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లుగా పోలీసులు భావించి లాఠీచార్జి చేశారని వారు ఆరోపించారు. మార్చ్‌కు ర్యాలీగా వస్తున్న విద్యుత్ ఉద్యోగ జేఏసీ కార్యకర్తలను ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. తెలంగాణవాదులను అరె స్టు చేయడం ఆపకపోతే సోమవారం తెలంగాణలో బస్సు సర్వీసులను నిలిపి వేస్తా మని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాంపల్లి నుంచి బయల్దేరిన తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. టఫ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. 

ర్యాలీగా బయలుదేరిన నేతలు... 
ఇందిరా పార్కు నుంచి బయల్దేరిన ర్యాలీలో బీజేపీ నేతలు కిషన్‌డ్డి, దత్తావూతేయ, ఇంద్రసేనాడ్డి, ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరిని కిషన్‌డ్డి ఖండించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యేలు జీ మల్లేష్, కూనంనేని సాంబశివరావు, చంద్రావతి తదితరుల నేతృత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి కిమ్స్ ఆస్పత్రి మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. క్లాక్ టవర్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ర్యాలీగా బయలుదేరారు. జలసౌధ నుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, బస్‌భవన్ నుంచి ఆర్టీసీ జేఏసీ, ఎన్‌ఎంయూ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. గన్‌పార్క్ నుంచి ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తెలంగాణ మార్చ్‌కు బయలుదేరారు.టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతిని ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. అంతకు ముందు టీడీపీ టీ ఎమ్మెల్యేలు గన్‌ఫౌండ్రీ నుంచి అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. దీంతో నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో, పోలీసులు అరెస్టు చేశారు. మార్చ్‌కు ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డిని పోలీసులు ఖైరతాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఎంపీల ధర్నా...
కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాష్కి, వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, రాజయ్య ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికి సీఎంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. 

రాజీనామాలకు వెనుకంజ వేయం: దామోదర
తెలంగాణ కోసం రాజీనామాలకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ‘‘మార్చ్ సందర్భంగా ఎక్కడైనా తెలంగాణ ప్రజానీకానికి ఏం జరిగినా, ఉద్యమాన్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తించినా జానాడ్డి చెప్పినట్లు రాజీనామాకు సిద్ధం. ఈసారి రాజీనామాలకు వెనుకంజ వేసేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. కవాతుకు వచ్చే వారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అన్నారు. పోలీసుల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఎంపీ జగన్నాథం తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న చర్యలను ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తీవ్రంగా ఖండించారు. 

సీఎం తన తెలివిని అరెస్టుల కోసం వాడొద్దు : కేకే 
అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్య అని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ముఖ్యమంవూతిని కలిసేందుకు వెళితే అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఆయన తెలివి తేటలను అరెస్టుల కోసం వాడకూడదని హితవు పలికారు.

దశాబ్దాల వివక్ష.. అణచివేతలను ఎదుర్కొంటున్న తెలంగాణ.. తన గోస చెప్పుకునేందుకు తలపెట్టిన తెలంగాణమార్చ్‌లోనూ అదే వివక్షలు, అణచివేతలు ఎదుర్కొన్నది. ప్రశాంతంగా మొదలైన సాగరహారం.. పోలీసుల అత్యుత్సాహం, మితిమీరిన జోక్యంతో రణరంగమైంది. మార్చ్‌కు అనుమతించిన మరుక్షణం నుంచే కుటిల పన్నాగాలు రచించిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్చ్ ముందు రోజు మరింత తెగించింది. హైదరాబాద్‌కు ఉద్యమకారుల రాకను అడ్డుకుంది. రైళ్లు, బస్సులు రద్దు చేసింది. ప్రైవేటు వాహనాలు కిరాయికి ఇవ్వకుండా వాటి యజమానులను బెదిరించింది. మార్చ్ జరిగే ఆదివారం సీమాంధ్ర పాలకుల దమననీతి పరాకాష్టకు చేరుకుంది. అన్నిరకాల నిర్బంధాలను ఎదుర్కొని హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఉద్యమకారులకు ఇక్కడా అడుగడుగునా పోలీసుల నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. పెద్ద సంఖ్యలో బాష్పవాయు గోళాలు ఉద్యమకారులను చెదరగొ విఫలయత్నం చేశాయి. కానీ.. ఎక్కడా తెలంగాణ శ్రేణులు తమ పట్టుదలను కోల్పోలేదు. నెక్లెస్‌రోడ్ వేదికగా జరిగిన మార్చ్‌ను దాదాపు ఐదు లక్షల మంది పోటెత్తించారు. తెలంగాణ పోరు సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంతటి బలమైనదో చూపించారు. జోరున వాన కురుస్తున్నా చలించక.. రెట్టించిన ఉత్సాహంతో జై తెలంగాణ నినాదాలు చేశారు.

వేదిక లక్ష్యంగా బాష్పవాయుగోళాలు
రాత్రి ఏడు గంటల సమయం సమీపిస్తు న్న నేపథ్యంలో పోలీసులు మరోసారి దుం దు డుకు చర్యలకు పాల్పడ్డారు. కూకట్‌పల్లి నాలా బ్రిడ్జి నుంచి వేదికపైన, సమీపంలోపడేలా టియర్‌గ్యాస్ ప్రయోగించారు. అదే సమయం లో వాటర్‌కెనాన్‌లను రంగంలోకి దింపారు. ఈ పరిణామాలకు ముందే టీ మా ర్చ్ లైవ్ కవరేజీని పాలకులు అడ్డుకుని నిలిపివేశారు. వేదిక సమీపంలో ఏం జరుగుతున్న దో తెలియనీయకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ఒకవైపు హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి పోలీసులు సంయమనం పాటించాలని విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే అవేవీ పట్టనట్లు రెచ్చిపోయారు. ఈ సమయంలో మా ర్చ్‌కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు ‘‘మీరు భయపడకండి. ఇక్కడి నుంచి ఎవరూ కదలొద్దు. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డం వేస్తాం. పోలీసులుటియర్ గ్యాస్ ప్రయోగిస్తే ముందు వరుసలో మేమే ఉంటాం’’ అని శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఓవైపు వేదికపై ప్రసంగాలు కొనసాగుతుండగానే టియర్‌గ్యాస్ ప్రయోగం జరగడంతో కోమటిడ్డి వెంకట్‌డ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. అస్వస్థతకు గురైన వారికి తెలంగాణవైద్యు లు హెల్త్ క్యాంపులో చికిత్స 

courtesy:Namasthe telangaana.com

1 కామెంట్‌:

  1. పెద్దమనుషులు ఒప్పందం మీద సంతకం చేస్తరు
    సిరా తడి ఆరకముందే దానిని చెత్తబుట్టలో పడేస్తరు........
    ......
    910 జీవో తీస్తరు
    దానిని అమలు చేయరు.....
    ....
    తెలంగాణా ఇస్తమంటారు
    తర్వాత తెడ్డు చూపిస్తరు....
    ....
    మీటింగ్ కు పర్మిషన్ ఇస్తున్నమంటారు
    నమ్మి వస్తే మక్కేలిరుగా తంతరు , రైళ్ళు బస్సులు రద్దు చేస్తరు ....
    ...
    నీటి జాతిలేని గీ ఆంద్ర కొడుకులతోని కలిసుండా ల్న ట...
    తూ ...

    రిప్లయితొలగించండి