23, నవంబర్ 2011, బుధవారం

తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు

తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు
lallu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకతో సభలోనే కాదు సభ వెలుపలా తెలంగాణ సందడి నెలకొంది. పార్లమెంటు ప్రాంగణంలో, సెంట్రల్ హాల్‌లో ఆయనకు తారసపడ్డ వివిధ పార్టీల ఎంపీలు జై తెలంగాణ అంటూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మరీ ముఖ్యంగా శివసేన, జేడీ(యూ), అకాలీదళ్, బీజేడీ తదితర పార్టీల నాయకులు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తెలంగాణకు మద్దతిస్తుందన్నారు. ‘తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే’ అని లాలూ అన్నారు. బీజేపీ సభ్యులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో కేసీఆర్‌ను కలిసిన ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారట కదా.. అని వాకబు చేశారు. తెలంగాణలో అన్ని పక్షాలు మద్దతిస్తున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీకి అభ్యంతరం ఎందుకని అసంతృప్తిని ప్రదర్శించారు.

తాత్సారం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తెలంగాణలో పార్టీ గల్లంతు కావడం తప్పదని అన్నారు. సభ లోపలా, వెలుపలా మంగళవారం నాటి తెలంగాణ పరిణామాలను నిశితంగా గమనించిన ఓ రాజకీయ విశ్లేషకుడు, ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏకక్షిగీవంగా అమోదిస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటికే బలహీనమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టడమా లేక పార్టీని భూస్థాపితం చేసుకోవడమా అన్నది కాంగ్రెస్ పెద్దలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతైనా తెలంగాణ రావాల్సిందేనన్న వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నందున కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆ పార్టీ నాయకుల చేతిలోనే ఉందని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి